రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులు ఇస్తున్నా..రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్
సినిమాథియేటర్లు, పంక్షన్ హాల్స్కు అనుమతి లేదు.
బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్ లు, జిమ్లు, పార్కులు బంద్
మెట్రో రైలు సర్వీసులు బంద్
అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేతఅన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేత