మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జ్వరం, ఛాతి నొప్పితో నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం ఆయన కార్డియో-థొరాసిక్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాత్రి 8:45 గంటలకు కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ ఆధ్వర్యంలో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు సమాచారం. అయన త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని తనతో సహా కోట్లాదిమంది భారతీయులు కోలుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానా అని అన్నారు. అంతే కాకుండా శివసేన నేత ఆదిత్య థాకరే, ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియ సూలే తదితరులు ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నారు.
మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలి
Subscribe
Login
0 Comments