కరుణానిధి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్కు తరలించారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చెన్నైకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మరోవైపు అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో రాజధానుల్లోనూ జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. కరుణకు అంజలి ఘటించేందుకు పలువురు నేతలు చెన్నైకు రానున్నారు. ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు తరలివస్తున్నట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి.
Subscribe
Login
0 Comments