ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రతి పక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు కావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషెస్కు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ.. ట్విటర్ వేదికగా స్పందించారు. ‘నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది మనకు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించాలంటే జననేత వైఎస్ జగన్ సీఎం కావాల్సిందే. మన శాయశక్తుల కృషి చేసి మన ఈ కలను సాకారం చేసుకుందాం’ అని ట్వీట్ చేస్తూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Subscribe
Login
0 Comments