వైసీపీ ఎమ్మెల్యేకు ఘలక్ …

Date:

2014 ఎన్నికలలో కడప జిల్లా రాయచోటి నుండి వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలిచిన విషయం తెలిసినదే . ఇప్పుడు ఆయనకు ఒక షాక్ తగిలింది . 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గ స్థానం నుంచి తాను పోటీలో ఉంటానని రాయచోటి వైసీపీ నియోజకవర్గ నేత మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు . శనివారం మండలంలోని రాచపల్లెకు చెందిన మేరా నాగన్న అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాంప్రసాద్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు . అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేస్తున్న ఉక్కు దీక్ష దండగని , వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందన్నారు . నియోజకవర్గంలో ప్రజలు మూడవ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని , తాను 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని , ఏ నాయకుడికి సపోర్టు చేయనని తెలిపారు . అనంతరం మండల కేంద్రంలోని అయోధ్యాపురం రాజశేఖర్‌రెడ్డి , చిట్లూరు పంచాయతీ పాలన్నగారిపల్లెకు చెందిన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారెడ్డి ఇళ్లకు తేనేటి విందుకు హాజరయ్యారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

Popular

More like this
Related

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు తెలంగాణ వీణ...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బేబీ’

ముక్కోణపు ప్రేమ కథతో.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ కొట్టింది...

నేడు “అనగనగా ఒక కథ” ట్రైలర్ విడుదల

రంగు రంగుల చిత్రాల హంగుల మధ్యలో మనం మర్చిపోయిన బ్లాక్ అండ్...

సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి- ఎందుకిలా? అసలేం జరిగింది?

<p>ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు...
error: Dont Copy Our Content !! To obtain a license to our content, please contact us!