బీజేపీ నేత కిషన్రెడ్డికి నాంపల్లి సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. కిషన్రెడ్డిపై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది. 2010లో విద్యార్థుల స్కాలర్షిప్ కోసం జరిగిన ఆందోళనలో కిషన్రెడ్డితో పాటు ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఈ కేసుపై విచారించిన కోర్టు ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొలి తీర్పు ఇదే.
Subscribe
Login
0 Comments