భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు మరో అరుదైన అవకాసం దక్కింది . ఇపటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ లో ఆడిన ఆమె ఇకపై ఇంగ్లాండ్ లో జరిగే కియా సూపర్ టీ20 లీగ్ లో ఆడనున్నారు . ఈ లీగ్ లో ఆడనున్న తొలి భారత క్రికెటర్ గా స్మృతి గుర్తింపు పొందారు . ఈ లీగ్ లో ఆమె వెస్ట్రన్ స్ట్రోమ్ తో ఒప్పొండం కుదుర్చుకున్నారు . ఈ విషయం పై స్మృతి స్పందిస్తూ “ఈ టోర్నీ లో ఆడుతున్న తొలి భారతీయురాలిని కావాదం చాలా గౌరవంగా భావిస్తున్నా . జట్టు విజయానికి కావలసిన కృషి చేస్తా ” అని తెలిపారు . “స్మృతి జట్టుతో కలవనుండటం చాలా సంతోషం . ప్రస్తుతం క్రికెట్లో ఆమె సంచలనం” అని వెస్ట్రన్ స్ట్రోమ్ కోచ్ ట్రెవర్ గ్రిఫిన్ అన్నారు.
తొలి భారత క్రికెటర్ గా …
Subscribe
Login
0 Comments