కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వృద్ధ జంట గుడిలో నివాసితున్నారని , వారికి కూడా రూ . 500 ఇంటి పన్ను వేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం ఓ తో పాటు మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశారు . వారికి ఆ డబ్బు తిరిగి చెల్లించాలని , అలాగే వెంటనే వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజారు చేయాలని డిమాండ్ చేశారు . అయితే ఈ విషయం పై కేటీఆర్ స్పందిస్తూ వారి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు . స్థానిక పంచాయతీ సెక్రెటరీకి ఈ విషయం తెలిపి, తప్పును సరిదిద్దుకునేలా చేయాలని ఆ జిల్లా కలెక్టర్కి కేటీఆర్ సూచించారు. అలాగే, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, వారికి ఆసరా పెన్షన్ అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే వచ్చేలా చేయాలని ఆదేశించారు .
Thanks Uttam Kumar Reddy Garu for bringing it to my notice
Request the @Collector_KB to direct local panchayat secretary to rectify this mistake@Collector_KB to also provide them with 2BHK and Aasara pension if they aren’t already revving it https://t.co/MstrswhWcD
— KTR (@KTRTRS) June 12, 2018