టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే గుర్తొచ్చే వాళ్ళల్లో అక్కినేని నాగార్జున , అమల ముందు వరసలో ఉంటారు. వివాహమై దాదాపు 26 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు . అయితే తాజాగా ఈ జంట తామ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు . ఈ విషయాన్ని ఈ జంట తనయుడు అక్కినేని అఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ‘లవ్బర్డ్స్తోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ ఎంతో అద్భుత సమయం. నేను ఎంతగానో ప్రేమించే అమ్మానాన్నలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంత గొప్ప ప్రేమకథ` అంటూ అఖిల్ ట్వీట్ చేశారు . అదే విధంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు .
Winding down with the love birds and the rest of the family. Happy anniversary to my dear parents who I love so much. What a love story 👏🏻 pic.twitter.com/gURfcuuMrE
— Akhil Akkineni (@AkhilAkkineni8) June 11, 2018