ఏపీలో ఇటీవల వరుసగా పడవ ప్రమాదాలు చోటుచేసుకొని అనేకమంది ప్రాణాలు కోల్పోయారు . ఇప్పుడు తాజా పులికాట్ సరస్సులో తృటిలో పెను ప్రమాదం తప్పింది . వివరాలలోకి వెళితే ఇరకం దీవిలో జరుగుతున్న పోనీయమ్మ రధోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు . ఇరకం – భీములపాలెం రేవుకు మధ్య భక్తులను తరలించేందుకు మత్యకారులు పడవలను వాడుతున్నారు . ఈ సందర్భంలో భీములపాలెం కు 30 మంది తో తిరిగి వస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది . భారీగా భక్తులు ఎక్కడంతో పడవ ఒకవైపుకు ఒరిగి పడవలోకి నీరు చేరడం ప్రారంభమయ్యింది . రేవు సమీపంలోకి వచ్చేసరికి పడవ పూర్తిగా మునిగిపోయింది . అయితే పడవ ఆ సమయానికే ఒడ్డుకు సమీపించడంతో కింద నెలకు పడవ అనుకుంది . దీన్ని గమనించి ఇతర పడవల నిర్వాహకులు వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి, అందరినీ ఒడ్డుకు తరలించారు. ఇదే ప్రమాదం సరస్సు మధ్యలో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. జరిగిన ఘటనతో భక్తులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తృటిలో తప్పిన పెను ప్రమాదం …
Subscribe
Login
0 Comments