కాటమరాయుడి సినిమాలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది . ఘంటసాల గ్రామానికి చెందినా ఎన్నారై గొర్రెపాటి నవనీతకృష్ణ 2014 లో రెండు ఎద్దులను కొని ఘంటసాలపాలేనికి చెందినా వేమూరి రాంబాబు సంరక్షణలో పెంచుతున్నారు . ఈ ఎద్దులు కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎద్దుల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాయి .అంతేకాక కాటమరాయుడు సినిమాలో నటించడంతో వీటి ప్రాచుర్యం మరింత పెరిగింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఎద్దు గురువారం మరణించడంతో రైతులు తీవ్ర మనస్థాపం చెందారు. అంతే కాక ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ఎద్దు కాటమరాయుడు సినిమాతో పాటు సావిత్ర సీరియల్లో కూడా నటించింది. చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మూడు షెడ్యూల్ షూటింగ్లో కూడా పని చేసినట్లు రాంబాబు వివరించారు.
కాటమరాయుడి ఎద్దు మృతి …
Subscribe
Login
0 Comments