జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర నిర్విరామంగా నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. అయితే మే 24 గురువారం ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన చేసింది . పవన్ కు ఈ యాత్రలో పోలీసులు భద్రత లభించటం లేదని , సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని పేర్కొంది . ఈ పర్యటనలో పవన్ భద్రతా సిబ్బందిలో 11 మంది గాయపడ్డారని , కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని. అందుకని గురువారం యాత్రకు విరామం ప్రకటించారు అని ప్రకటనలో పేర్కొంది .
జనసేన పోరాట యాత్రకు బ్రేక్…
Subscribe
Login
0 Comments