జనసేన పోరాట యాత్ర మూడవ రోజుకు చేరుకుంది . నిన్న ఇచ్చాపురం నుండి బయల్దేరి సోంపేట మీదుగా రాత్రికి పలాస చేరుకున్నారు . ఈరోజు షెడ్యూల్ ఈ విధంగా ఉంది
ఉదయం పార్టీ స్థానిక నాయకులతో పార్టీ విస్తరణ స్థానిక సమస్యలపై చర్చిస్తారు . మధ్యాహ్నం టీ. కే. ఆర్ కళ్యాణ మండపం వద్ద వివిధ ఉద్యోగ సంఘాల వారిని కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు అభిమానులు,జనసేన కార్యకర్తలతో కలిసి నిరసన కవాతులో పవన్ పాల్గొంటారు. కవాతు ముగిసిన తరువాత కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.