- దాచేపల్లి ఘటనలో బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు
- ఈ ఘటన చాలా బాధాకరం
- బాధితురాలికి సంఘీ భావంగా ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తాం
మనిషి ఒక మృగంలా బతకడానికి వీల్లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. దాచేపల్లి ఘటనలో అత్యాచారానికి గురైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆయన పరామర్శించారు. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, దాచేపల్లి ఘటన చాలా బాధాకరం, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నాగరిక ప్రపంచం సిగ్గుపడాలని, రాష్ట్రానికి సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.